Thursday, May 2, 2024

విద్యుత్ సవరణ బిల్లుతో ప్రజలకు ఉపయోగం లేదు: జగదీష్

- Advertisement -
- Advertisement -

Central conspiracy on Electricity Amendment Bill

హైదరాబాద్: విద్యుత్ విషయంలో రాష్ట్రాలు ముందుకు పోవడం ఇష్టం లేనివారు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్ర విద్యుత్ చట్ట సవరణ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ప్రజలకు ఉపయోగపడే పద్దతిలో విద్యుత్ చట్ట సవరణ బిల్లు లేదని మండిపడ్డారు. విద్యుత్ సబ్సిడీ పొందుతున్న వారికి బిల్లు నష్టం చేకూర్చేలా ఉందన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో కేంద్రం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేసేలా ఉందన్నారు. రాష్ట్రాల హక్కులను హరించేలా బిల్లును కేంద్రం రూపొందించిందని జగదీష్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News