Friday, May 3, 2024

చంద్రబాబు జైలుకు.. రేపు ఎపి బంద్‌కు టిడిపి పిలుపు

- Advertisement -
- Advertisement -

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఎసిబి కోర్ట్ రిమాండ్ విధించడంతో తెలుగుదేశం శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసన చేస్తున్నాయి. ఇదిలావుండగా చంద్రబాబు రిమాండ్‌కు నిరసనగా రేపు ఎపి బంద్‌కు టిడిపి పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను అధిష్టానం ఆదేశించింది.

జిల్లా ఎస్పీలకు కీలక ఆదేశాలు
ఈ పరిస్థితుల్లో ఎపిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జిల్లాల ఎస్‌పిలకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు గుంపుగా ఉండకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News