Sunday, April 28, 2024

డబుల్ బెడ్ రూమ్స్ పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

Cheating with name of double bedrooms

రూ.15 నుంచి 20లక్షలు వసూలు
అరెస్టు చేసిన సనత్‌నగర్ పోలీసులు

హైదరాబాద్: డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితురాలిని సనత్ నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లాపూర్‌కు చెందిన ఆయేషా, సుప్రియ కలిసి సామాజిక సేవ చేస్తున్నామని తిరుగుతున్నారు. డబుల్ బెడ్‌రూములు ఇప్పిస్తామని చెప్పి స్థానికంగా ఉంటున్న వారి వద్ద నుంచి రూ.15లక్షల నుంచి 20లక్షల వరకు వసూలు చేశారు. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురి వద్ద నుంచి వసూలు చేశారు. ఎస్‌ఆర్ నగర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 15 నుంచి 30మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Cheating with name of double bedrooms

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News