Tuesday, April 30, 2024

చికెన్ అమ్మే వ్యక్తికి కరోనా…. గాజువాక ప్రజల్లో ఆందోళన

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: చికెన్ అమ్మే వ్యక్తికి కరోనా సోకడంతో వైజాగ్‌లోని గాజువాక ప్రాంతం కుంచమాంబలో ప్రజలు ఆందోళన గురవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్ర వరకు సదరు వ్యాపారి షాపులో కూర్చొని చాలా మందికి చికెన్ అమ్మాడు. ఆదివారం అతడి చికెన్ షాపు జనంతో నిండిపోయింది. అతడికి తీవ్రమైన జ్వరం, జలుబు ఉండడంతో స్థానిక ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అతడి పరీక్షలు చేయగా కరోనా పాజిటీవ్ వచ్చింది. సదరు వ్యక్తి మార్చి 22న విదేశాల నుంచి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దీంతో కుంచమాంబ కాలనీని పోలీసులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. వైజాగ్‌లో ఇప్పటి వరకు 18మందికి కరోనా వైరస్ సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోగుల సంఖ్య 304కు చేరుకోగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా వైరస్ 364 మందికి సోకగా 11 మంది చనిపోయారు.

 

Chicken shop owner Corona positive in Gajuwaka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News