Tuesday, May 14, 2024

‘చివరి రక్తపుబొట్టు వరకూ’ పోరాడుదాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘ఈ దేశం మనందరిది. మనం ముందుకు సాగుదాం. ఈ దేశాన్ని సురక్షితంగా కాపాడుకుందాం. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుదాం’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుధవారం ఎల్‌బి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘ఈ దేశ గంగా జమున సంస్కృతిని, ఆచార, సాంప్రదాయాలను ఎవరూ మార్చలేరు. అలా ప్రయత్నించిన వారు అంతమవుతారు. కానీ దేశం ఎ న్నటికీ నిలిచే ఉంటుంది’ అన్నారు. నా మాటల పై న మ్మకం ఉంచాలని కోరారు. సమయం వచ్చినపుడు దే శాన్ని రక్షించుకోవడానికి శక్తిని కాకుండా యుక్తిని ప్ర యోగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న దేశ రాజ కీయ పరిస్థితులను మార్చేందుకు దేశ రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీకి ఘన స్వాగతం పలుకుతున్నారని అంచనాల కు మించి ప్రజాదారణ లభిస్తున్నదని చెప్పారు.

దేశం సరైన నాయకుని కోసం, పార్టీ కోసం వేచి చూ స్తోందన్నారు. రక్షించుకునేందుకు శాయశక్తు ల కృషి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చిత్తశుద్దితో గట్టి సంకల్పంతో కార్యాన్ని ప్రారంభించినప్పుడు గ మ్యాన్ని చేరుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవుతుండవచ్చగానీ గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఖాయం” అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పోరాడినట్లు గానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి లక్ష్యం చేరుకోవడం తథ్యమని..‘ అల్లా కే ఘర్ దేర్ హై, అంధేర్ నహీ’ అని, ముఖ్యమంత్రి అన్నారు. తొమ్మిది, పదేళ్ల క్రితం మనల్ని వెనుకబడిన వారిగా పరిగణించేవారని నేడు అల్లా దయతో, అంద రి ప్రార్థనలతో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే పోటీ అనేది లేదన్నారు. కేంద్రం పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిందని గుర్తు చేశారు. దేశంలో మరే రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,17,115 ఉన్నదని. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పెద్ద పెద్ద రాష్ట్రాలకంటే మనం ముందంజలో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తలసరి విద్యుత్ వినియోగం 1000 నుండి 1050 యూనిట్లు ఉండేదని, నేడది రెండింతలు పెరిగి 2100 యూనిట్లకు చేరుకున్నదని చెప్పారు. దేశంలోనే మనం అత్యున్నత స్థానంలో నిలిచామన్నారు. పరిశ్రమలు, ఐటి రంగంలో పురోగమిస్తున్న తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. అసదుద్దీన్ ఓవైసి, ఇతర నేతలు కోరిన మేరకు అనీస్ ఉల్ గుర్బా ను అత్యద్భుతంగా నిర్మించుకున్నామని సిఎం కెసిఆర్ చెప్పారు. బిఆర్‌ఎస్ కు ముందు ఈ ప్రాంతాన్ని 10 సంవత్సరాలపాటు కాంగ్రెస్ పార్టీ పాలించిందని . ఈ పదేళ్ళలో దాదాపు రూ.1200 కోట్లు మాత్రమే వారు ఖర్చు చేస్తే, బిఆర్‌ఎస్ ఈ పదేళ్ల కాలంలో రూ.12000 కోట్లను ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేసిందని చెప్పారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెలువరించిన గణాంకాలు. అసెంబ్లీ, సెక్రటేరియట్ తో పాటు మైనార్టీ వెల్ఫేర్ సైట్ లో ఈ వివరాలను చూడవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. గతంలో లా రైతుల ఆత్మహత్యలు లేవని. జీవన పోరాటం లో భాగంగా బయటి రాష్ట్రాలకు వెళ్ళిన రైతులు నేడు వారి వారి ఊళ్లకు తిరిగి వచ్చారని పేర్కొన్నారు.

రోజు దేశం అగమ్యగోచర స్థితిలో పయనిస్తున్నది. భారతదేశం మనందరిదీ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం మన దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న కష్టాలు వస్తూనే ఉంటాయి. మీ సహకారం ఉంటే చివరి వరకు పోరాడుతూనే ఉందాం. ఇది తాత్కాలిక దశ. ఈ సమయంలో ఒనగూరేదేం ఉండదు. తుదకు న్యాయమే గెలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అంతకు ముందు ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు ఎల్బీ స్టేడియం కు చేరుకున్న సిఎం కెసిఆర్ ముందుగా అనాథ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు, చదువు వివరాలను సిఎం అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఇంగ్లీషు భాషలో సంభాషిస్తుంటే ఆనందిస్తూ వారితో ముచ్చటించారు. వారి ఇంగ్లీషు భాషా పరిజ్జానాన్ని సిఎం అభింనందించారు. ఇంకా గొప్పగా చదవి ఉన్నతస్థాయికి చేరుకోవాలని భుజం తట్టారు. వారితో చేయి చేయి కలిపి వారి ఆనందాన్ని పంచుకున్నారు. అక్కడి నుండి సభా వేదికకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మైనార్టీస్ సంక్షేమ శాఖ కమిషనర్ షఫీ ఉల్లా, మైనార్టీస్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎ.కె.ఖాన్ ఘన స్వాగతం పలికారు, జ్ఞాపిక, భారతదేశ పటంలో సీఎం కేసీఆర్ గారిని చిత్రించిన ఫోటోను బహుకరించారు. అనంతరం సిఎం కెసిఆర్ ముస్లిం మత పెద్దల వద్దకు వెల్లి వారి పేరు పేరునా పలకరించి అభివాదాలు తెలిపారు.

అప్పటికే ఎల్ బీ స్టేడియం సభా ప్రాంగణానికి భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగించారు. రోజా’ (ఉపవాస దీక్ష) విడిచే సమయానికి సిఎం ప్రసంగం ముగిసింది. అజాన్ పిలుపు తర్వాత ఇస్లాం సాంప్రదాయం పద్దతిననుసరించి తనతో పాటు ఆశీనులైన పలువురికి ఇఫ్తార్ విందును అందించి సిఎం కేసీఆర్ రోజా’ను విరమింపజేశారు.అనంతరం ప్రముఖులతో కలిసి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపి అసదుద్దీన్ ఒవైసి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనా చారి, ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, భేతి సుభాష్ రెడ్డి, కాలేరు వెంకటేష్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎ.కె.ఖాన్, సిఎస్ శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్, మైనార్టీస్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, మైనార్టీస్ వెల్ఫేర్ కమిషనర్ షఫీ ఉల్లా, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News