Saturday, May 4, 2024

‘మహా’ వలసలు.. అన్‌స్టాపబుల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతున్నది. పొరుగు రాష్ట్రాల్లోని ఆయా పార్టీలకు చెందిన నేతలు, మేధావులు, డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీని పల్లె పల్లెకు విస్తరిస్తామన్న బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించి న సంగతి తెలిసిందే. కెసిఆర్ ప్రకటనకు అనుగుణంగానే మహారా ష్ట్ర నుంచి బిఆర్‌ఎస్‌లోకి వలసలు శరవేగంగా సాగుతున్నాయి. బు ధవారం నగరంలో పలువురు రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన వృత్తి నిపుణులు, ప్రముఖులు బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి సిఎం కెసిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాసిక్ సివిల్ సర్జన్ డా. లక్ష్మణ్ సబలే, ఆర్థోపెడిక్ డా. షేక్, అడ్వకేట్ ఎన్. కె. మహాజన్, క్రిస్టియన్ ట్రైబల్ కమ్యూనిటీ స్టేట్ ప్రెసిడెంట్ సందీప్ దేవ్రే, లాథూర్ లోని దేవ్నీ కార్పొరేటర్ సూర్యవంశీ.

అమిత్ విజయ్ ప్రకాశ్, భుసావల్‌కు చెందిన నితిన్ తయాడే, స్వాభిమాని షేట్కారి సంఘటన్ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ సోమ్ నాథ్ బోరడే, గంగాఖేడ్ మున్సిపాలిటీ కార్పొరేటర్లు తుకారం తాండడే, బాలాసాహెబ్ రేక్, పాలం మున్సిపాలిటీ కార్పొరేటర్లు బబ్లూ సయ్యాద్, చాంద్ పఠాన్, బీడ్ కో ఆపరేటీవ్ బ్యాంక్ మెంబర్ శివాజీ రావ్ ఘోడకే, స్వాభిమాని పక్ష్ జిల్లా అధ్యక్షుడు కుల్దీప్ కర్పే, బీడ్ సేవా సెహ్ కారి సంస్థ చైర్మన్ కమలాకర్ లాండే, స్వాభిమాన్ పక్ష్ తాలూకా ప్రెసిడెంట్ లాహు గైక్వాడ్, జలగావ్ కు చెందిన భికు సోనావానే, సోను పాటిల్, సునీల్ రౌత్, విలాస్ మలేస్, నాసిక్ కు చెందిన సచిన్ కడ్, ముకుంద్ అహిర్, రామ్ నికమ్, బాపు దూబె, ప్రొ. చంద్రకాంత్ భచౌ, కార్పొరేటర్, ఎన్‌సిపి షేలు తహసీల్ ప్రెసిడెంట్ రహీమ్ ఖాన్ పఠాన్ తదితరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుచేస్తున్న పథకాలతో పురోగామి రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తీరుతో స్ఫూర్తి పొంది, రాష్ట్రాల్లోని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్న తీరు సమకాలీన రాజకీయాలను ప్రభావితం చేస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News