Thursday, May 2, 2024

రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
సిఎం కెసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయంలో గురువారం తొలి కేబినెట్ సమావేశం జరుగనుంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

నేడు బిఆర్‌ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన బుధవారం బిఆర్‌ఎస్ లెజిస్టేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఆ పార్టీ ఎంపిలు,ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ అధ్యక్షత వహించనున్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు, బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News