Friday, May 3, 2024

టిఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు.  తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొ. జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వెంట హోం మంత్రి మహమూద్‌ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌, ఎంపి కె కేశవరావు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, తదితరలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు సామాజిక దూరం పాటిస్తూ టిఆర్ఎస్ 20వ వసంత వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లా, మండల, గ్రామ శాఖ టిఆర్ఎస్ అధ్యక్షులు ఇంటి వద్దనే టిఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ అధిష్టానం అదేశించింది.

CM KCR host TRS Party flag in Telangana bhavan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News