Thursday, May 2, 2024

కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా టిమ్స్: వినోద్ కుమార్

- Advertisement -
- Advertisement -

Vinod Kumar

 

హైదరాబాద్: మిషన్ కాకతీయ అనే పదాన్ని 2002లోనే కెసిఆర్ చెప్పారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో స్టాండింగ్ కమిటీ వైస్ చైర్మన్ వినోద్ మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ అనే పథకాన్ని ఆనాడే కల్పన చేసి అమలు చేసిన ఘటన సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే పుంజుకుంటుందని, తెలంగాణలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను తట్టుకొని నిలబడుతోందన్నారు. పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ టిఆర్‌ఎస్ అని అన్నారు. కెసిఆర్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదని ఆయనొక సోషల్ సైంటిస్ట్ ఎకనామిస్ట్ అని ప్రశంసలు కురుపించారు. టిమ్స్‌ను హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా తీర్చిదిద్దబోతున్నామన్నారు.

 

TIMS developed as like as Private hospital in Hyd
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News