- Advertisement -
హైదరాబాద్: ఒఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొండుపల్లి టోల్ గేటు సమీపంలో వాటర్ ట్యాంకర్ ను డిసిఎం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ ఉల్లిగడ్డల లోడ్ తో వస్తున్న వాహనం అదుపు తప్పి వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డిసిఎం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు.
One member dead in DCM collided to water tanker
- Advertisement -