Sunday, April 28, 2024

బ‌డ్జెట్‌పై ముఖ్యమంత్రి మ‌ధ్యంత‌ర స‌మీక్ష‌

- Advertisement -
- Advertisement -

CM KCR Interim Review on the Budget

హైదరాబాద్‌: కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కెసిఆర్ 2020-2021 ‌బ‌డ్జెట్‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మ‌ధ్యంత‌ర స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థికశాఖ అధికారులు పాల్గొన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, సవరించాల్సిన అంశాలపై సిఎం కెసిఆర్ చర్చిస్తున్నారు. ఈ స‌మావేశం అనంత‌రం ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై సమీక్షిస్తారు. శనివారం సాయంత్రం 4గంటలకు ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. నిర్మాణ పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News