హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సిఎం కెసిఆర్ భేటీ అయ్యారు. నూతన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లు పెరిగిన నేపథ్యంలో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయాలని సిఎం కెసిఆర్ వినతిపత్రం అందించారు. గతంలో 9 జిల్లా పోలీసు కార్యాలయాలు, 2 పోలీసు కమిషనరేట్లు ఉండేవని.. ప్రస్తుతం పాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన జరిగిందని తెలిపారు. 20 జిల్లా పోలీసు కార్యాలయాలు, 9 పోలీసు కమిషనరేట్ల ఏర్పాటు జరిగిందని చెప్పారు. 2016లో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష జరిగిందని, 76 సీనియర్ డ్యూటీ పోస్టులతో కలిపి మొత్తం 139 ఐపీఎస్ పోస్టులను కేంద్ర హోంశాఖ ఆమోదించిందన్నారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు, కొత్త జోన్లు ఏర్పాటు జరిగిందని, కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటుగా మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వినతిపత్రం అందించి విజ్ఞప్తి చేశారు.
CM KCR Meeting with Amit Shah