- Advertisement -
హైదరాబాద్: ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కెసిఆర్ ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అధికారులు ఈ సమావేశానికి సమగ్ర సమాచారంతో రావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. దేశంలోనే మొదటిసారిగా, విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించేందుకు ధరణి పోర్టల్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి చెప్పారు. రెవెన్యూ శాఖలో అవినీతి, అవకతవకలు జరగకుండా ఉండేందుకు నూతన రెవెన్యూ చట్టాన్ని తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
CM KCR Review Meeting on Dharani Website
- Advertisement -