- Advertisement -
హైదరాబాద్: ధరిణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కాసేపట్లో సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ, న్యాయ నిపుణులతో సమావేశం కానున్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లాలా? వద్దా.. అనే విషయంపై చర్చించనున్నారు సిఎం కెసిఆర్. ఇప్పటికే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై గందరగోళం నెలకొంది. ఆస్తుల నమోదుకు ఆధార్ వివరాలు ఆడగొద్దని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు తాత్కలికంగా నిలిపివేసింది. ఈ భేటీతో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై క్లారిటీ రానుంది.
- Advertisement -