- Advertisement -
కలకత్తా: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగాల్ చేరుకున్న అమిత్ షా సమక్షంలో పలువురు టిఎంసి ఎంఎల్ఎలు, ఎంపి, మాజీ ఎంపిలు బిజెపిలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి అమిత్ షా ఆధ్వర్యంలో పశ్చిమ మిడ్నాపూర్ భారీ బహిరంగ సభలో కాషాయతీర్థం పుచ్చుకున్నారు. టిఎంసి వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిర్ణయాలతో విభేదాలే సువేందు రాజీనామాకు కారణమ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అటు రానున్న ఎన్నికల్లో బెంగాల్ 200పైగా స్థానాలు గెలుస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
- Advertisement -