- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలోని రోడ్లభద్రతపై సిఎస్ సోమేష్ కుమార్ అధికారులతో శనివారం భేటీ అయ్యారు. అంబులెన్స్ లు, ఆస్పత్రులు, ట్రామాకేర్ సెంటర్ల మ్యాపింగ్ పై సమీక్షించారు. అన్ని జిల్లాలకు రోడ్ల భద్రతా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సిఎస్ ఆదేశించారు. గోల్డెన్ అవర్ లో వైద్యసాయం అందించి ప్రాణాలను కాపాడేలా చూడాలన్నారు. ట్రామాకేర్ కేంద్రాల్లోని సిబ్బందికి అత్యవసర వైద్యంపై శిక్షణ ఇవ్వాలని సిఎస్ పేర్కొన్నారు. ఔటర్ పై ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని అంశాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆయన సురక్షిత డ్రైవింగ్ పై ప్రభుత్వ డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశానికి ఆర్ అండ్ బి, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు.
CS Somesh Kumar review with authorities on road safety
- Advertisement -