Monday, May 20, 2024

4న సిరిసిల్ల జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

CM KCR says urges centre to bharat ratna award to PV

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈ నెల 4వ తేదీన సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్మించిన ఉచిత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పేదలకు పంపిణీ చేయనున్నారు. అలాగే జిల్లాలో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు నర్సింగ్ కళాశాలను కూడా సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. ఇటీవలే సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో పర్యటించిన ఆయన తాజాగా సిరిసిల్లలో పర్యటించాలని నిర్ణయించారు. ఇలా సిఎం కెసిఆర్ వరసగా జిల్లాల పర్యటనలు చేస్తుండడం రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠతకు గురి చేస్తున్నది.

CM KCR to visit Sircilla on July 4

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News