Thursday, May 2, 2024

15 వ సారి పతాకావిష్కరణతో సిఎం నితీష్ రికార్డు

- Advertisement -
- Advertisement -

CM Nitish sets record with flag unveiling for 15th time

 

పాట్నా : క్రమం తప్పకుండా పదిహేనోసారి ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రికార్డు సృష్టించారు. రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల మంత్రి సంజయ్‌కుమార్ ఝా దీన్ని గుర్తు చేస్తూ మిఠాయి పంచిపెట్టారు. నితీష్ అధికారం లోకి వచ్చి 5474 రోజులు పూర్తయ్యాయన్న వాస్తవాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. అంతకు పూర్వ దివంగత ముఖ్యమంత్రి శ్రీక్రిష్ణ సిన్హా రికార్డును కూడా నితీష్ అధిగమించ గలిగారు. 1946 లో మొదటి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీక్రిష్ణ సిన్హా 1961 వరకు కొనసాగారు. బ్రిటిష్ కాలంలో 1935 ప్రభుత్వ చట్టం ప్రకారం జరిగిన ప్రావిన్షియల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక మొదట ప్రీమియర్‌గా శ్రీక్రిష్ణ ఎన్నికయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News