Thursday, May 2, 2024

రైతు బీమా, సియం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

CM Relief fund released in Joganpally

 

మన తెలంగాణ / కోరుట్ల రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని జోగన్‌పల్లి గ్రామంలో రైతు బీమా, యూసుఫ్ నగర్ గ్రామంలో సియం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. జోగన్‌పల్లిలో అనారోగ్యంతో మరణించిన రైతు శివనీతుల శ్రీనివాస్ కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతు భీమా ప్రొసిడింగ్ కాపీని, యూసుఫ్ నగర్ గ్రామంలో దుంపేట శ్రీనివాస్, గొట్టిముక్కల రాజమణి అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా ఆర్థికంగా ఆదుకునేందుకు ఒక్కొక్కరికి 20వేల రూపాయల సియం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో యూసుఫ్ నగర్ గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజనర్సయ్య, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, యూసుఫ్ నగర్ ఎంపిటిసి గుగ్గిళ్ల ప్రియాంక సురేష్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గుగ్గిళ్ల సురేష్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సైదు గంగాధర్, గోపు ప్రశాంత్, చంద్రశేఖర్, మురళీధర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, కందుల శ్రీనివాస్, నారాయణ, భూమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News