Thursday, May 2, 2024

రాజీవ్ రతన్ మృతిపట్ల సిఎం రేవంత్ రెడ్డి సంతాపం

- Advertisement -
హైదరాబాద్: సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోదన్నారు. రాజీవ్ రతన్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ప్రస్తుతం రాజీవ్‌ రతన్ తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన తీవ్ర గుండెపోటు రావడంతో ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
1991 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్​ విచారణకు ఆయనే సారధ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పిగా, పైర్ సర్వీసెస్ డిజిగా సేవలందించారు. హైదరాబాద్ రీజియన్ ఐజిగా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండిగా వివిధ హోదాల్లో పని చేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News