Sunday, April 28, 2024

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతిపై సిఎం రేవంత్ రెడ్డి సంతాపం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సిఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సిఎం గుర్తు చేసుకున్నారు. జన్నత్ హుస్సేన్ మృతి పట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

జన్నత్ హుస్సేన్ ఉమ్మడి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ సిఎంగా ఉన్న సమయంలో సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసి స్పెషల్ సిఎస్ హోదాలో రిటైరయ్యారు. తర్వాత సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ గా పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో అమల్లోకి తెచ్చిన ఉచిత విద్యుత్ పథకం విధి, విధానాలను రూపొందించి రైతులకు మేలు చేయటంలో ఆయన విశేషంగా కృషి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News