Sunday, May 5, 2024

సిఎం కెసిఆర్ పర్యటనను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: 24 న జిల్లాలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఅర్ పర్యటనను అన్ని శాఖల ఆధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బహిరగ సభ ని ర్వహించే స్థలాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24 వ తేదిన సీఎం కేసిఅర్ చేతుల మీదుగా జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీసు కార్యాలయం, బిఅర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్న సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

బహిరంగ సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధికారిని మణేమ్మ, సిఐ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ గాదావేణి మల్లేష్, సంబంధిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News