Sunday, May 5, 2024

ఢిల్లీలో సిఎన్‌జి ధర కేజీకి రూ. 2.50 పెంపు

- Advertisement -
- Advertisement -

CNG price hiked by Rs 2.50 per kg

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గురువారం సిఎన్‌జి ధరలు కిలోగ్రాముకు రూ. 2.50 చొప్పున పెరిగాయి. గత నెల రోజుల్లో వీటి ధరలు పెరగడం ఇది 10వ సారి. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ(ఎన్‌సిటి) ఆఫ్ ఢిల్లీలో సిఎన్‌జి కిలోగ్రాము రూ. 66.61 నుంచి రూ. 69.11కి పెరిగినట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ గురువారంత తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దేశ రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాలలో సిఎన్‌జితోపాటు ఇళ్లకు పైపుల ద్వారా వంటగ్యాసును ఈ సంస్థే సరఫరా చేస్తుంది. మార్చి 7న మొదలైన ధరల పెంపు వరుసగా రెండవరోజు రూ. 2.50 చొప్పున 10వ సారి కొనసాగింది. గత ఏడాది కాలంలో 60 శాతం అంటే రూ. 25.71 కిలోగ్రాము చొప్పున సిఎన్‌జి ధరలు పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News