Wednesday, May 1, 2024

కరోనాతో మృతి చెందిన ఎయిర్ ఇండియా ఉద్యోగులకు పరిహారం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొవిడ్19 వల్ల మృతి చెందిన తమ ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్టు ఎయిర్ ఇండియా ఓ అంతర్గత సర్కులర్‌ను జారీ చేసింది. శాశ్వత ఉద్యోగుల కుటుంబాలకు రూ.10లక్షలు, నిర్ణీతకాల ఒప్పంద ఉద్యోగులకు రూ.5 లక్షలు, ఏడాది కాలానికిపైగా పని చేస్తున్న కాజువల్ ఉద్యోగులకు రూ. 90,000 చొప్పున ఇవ్వనున్నట్టు సర్కులర్‌లో పేర్కొన్నారు. కరోనా వల్ల ఇప్పటికే కొందరు ఉద్యోగులు మరణించారు. అయితే, వారి సంఖ్య ఎంత అన్నది అధికారికంగా వెల్లడించలేదు. వారం రోజుల క్రితం ఎయిర్ ఇండియా సిఎండికి యూనియన్లు ఇచ్చిన విజ్ఞాపనలో 55మంది పైలట్లు కరోనా బారిన పడ్డట్టు తెలిపారు. ఈ పరిహారం ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి 2021, మార్చి31 వరకు వర్తిస్తుందని సర్కులర్‌లో పేర్కొన్నారు. గడువు తేదీపై మరోసారి సమీక్షించనున్నారు.

Compensation for Air India employees died with Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News