Saturday, May 4, 2024

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

హన్మకొండటౌన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 118 ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్ డిఆర్ వో వాసు చంద్ర, సిపిఓ సత్యనారాయణ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News