- Advertisement -
హైదరాబాద్: ములుగు ఎంఎల్ఎ, కాంగ్రెస్ పార్టీ నేత సీతక్క మంగళవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో సీతక్క నేతృత్వంలో మంగళవారం దళిత గిరిజన దండోరా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రను పురస్కరించుకుని సీతక్క 4 కి.మీ పాదయాత్ర నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డు నుండి తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకి వినతిపత్రం అందించి అక్కడే కూర్చొన్న సమయంలో సీతక్క సొమ్మసిల్లి పడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీతక్కను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సీతక్కకు వైద్యులు పరీక్షించారు. సీతక్క అనారోగ్యం పాలు కావడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
- Advertisement -