- Advertisement -
ముంబయి: కానిస్టేబుల్ భార్య తన కూతురిని చంపిన అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బడ్లాపూర్లో ఆశిక్ పాటిల్ అనే కానిస్టేబుల్ మీనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఏడేళ్ల పాప కూడా ఉంది. మీనా తన కూతురి గొంతును కత్తితో కోసి అనంతరం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంలో చెలరేగియన కలహాలతో ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కానిస్టేబుల్ ఆశిక్ పాటిల్ నోరు తెరిస్తే కానీ నిజాలు బయటపడవు.
- Advertisement -