- Advertisement -
నేరెడ్మెట్: హైదరాబాద్ నేరెడ్మెట్లోని జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ జరిగింది. గురువారం అర్థరాత్రి సమయంలో ధనలక్ష్మి జ్యవెలరీ దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణంలో 25 తులాల బంగారం, 70 కిలోల వెండి ఎత్తుకెళ్లారు. దీంతో షాప్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు. దుకాణంలోని సిసి కెమెరాలను కూడా దుండగులు ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీంతో విచారణ చేస్తున్నారు.
huge burglary at dhanalakshmi jewellers at hyderabad
- Advertisement -