Monday, May 6, 2024

భారత్ లో పెరుగుతున్న కరోనా.. కొత్త కేసులు 10,093

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,093 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 57000లకు చేరుకుంది. గడిచిన 24గంటల్లో కరోనాతో 23మంది మృతి చెందారు.

Read also: సిబిఐ వంద సార్లు పిలిచిన వెళ్తా…

దీంతో మృతుల సంఖ్య 5,31,114 కు చేరింది. గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజలు బూస్టర్ డోస్ లు తీసుకోవాలని, మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News