- Advertisement -
హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశ ప్రధానులు మొదలు సామాన్య జనాల వరకు కరోనా బారినపడుతున్నారు. రోజు రోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 8,60,696 మందికి సోకగా 42,352 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 1,78,537 మంది కోలుకున్నారు. ఒక్క అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 1,88,592 మందికి చేరుకుంది. కరోనాతో ఇటలీలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఒక్క ఇటలీ దేశంలో కరోనాతో 12,428 మృతి చెందారు. భారత్ దేశంలో కరోనా రోగులు సంఖ్య 1750కి చేరుకుంది. కరోనాలో భారత్లో ఇప్పటి వరకు 53 మంది చనిపోయారు. తెలంగాణ కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 97, ఎపిలో 87కు చేరుకుంది. కరోనా వ్యాధితో తెలంగాణ ఆరుగురు మరణించారు. భారత్ లో దేశంలో కరోనా రోగుల సంఖ్య మహారాష్ట్ర(325) తొలిస్థానంలో ఉంది.
Corona virus more spread in Telangana and Andhra
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
|
కరోనా రోగుల సంఖ్య | కరోనా నుంచి కోలుకున్నవారు |
మృతులు
|
---|---|---|---|
మహారాష్ట్ర | 325 | 39 | 12 |
కేరళ | 241 | 24 | 2 |
తమిళనాడు | 124 | 6 | 1 |
ఢిల్లీ | 123 | 6 | 2 |
రాజస్థాన్ | 106 | 3 | – |
కర్నాటక | 105 | 9 | 3 |
ఉత్తర ప్రదేశ్ | 104 | 17 | 1 |
తెలంగాణ | 97 | 14 | 6 |
ఆంధ్రప్రదేశ్ | 87 | 1 | – |
మధ్య ప్రదేశ్ | 86 | – | 6 |
గుజరాత్ | 82 | 5 | 6 |
జమ్ము కశ్మీర్ | 55 | 1 | 2 |
పంజాబ్ | 45 | 1 | 4 |
హర్యానా | 43 | 17 | – |
పశ్చిమబెంగాల్ | 27 | – | 6 |
బిహార్ | 23 | – | 1 |
ఛండీగఢ్ | 15 | – | – |
లడఖ్ | 13 | 3 | – |
అండమాన్ నికోబార్ ఐలాండ్స్ | 10 | – | – |
ఛత్తీస్ గఢ్ | 9 | 2 | – |
ఉత్తరఖాండ్ | 7 | 2 | – |
అస్సాం | 5 | – | – |
గోవా | 5 | – | – |
ఒడిశా | 4 | – | – |
హిమాచల్ ప్రదేశ్ | 3 | 1 | 1 |
పుదుచ్చేరీ | 3 | – | – |
జార్ఖండ్ | 1 | – | – |
మణిపూర్ | 1 | – | – |
మిజోరం | 1 | – | – |
మొత్తం | 1750 | 151 | 53 |
- Advertisement -