Monday, April 29, 2024

క్వారంటైన్ లో ఉన్న వ్యక్తి కత్తిపీటపై పడి మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: హోంక్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి కత్తిపీటపై పడిపోవడంతో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భారత్ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన వ్యక్తి తన భార్యతో కలిసి హోంక్వారంటైన్‌లో ఉంటున్నాడు. అతడు ఇంట్లో కూరగాయాలు కోస్తుండగా కాలు జారి కత్తిపీటపై పడిపోయాడు. కత్తి పీట గుండె భాగంలో గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. గ్రామస్థులు 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. వైద్యం సరైన సమయంలో అందకపోవడంతో అతడు మృతి చెందినట్లు గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.

 

Andhra person dead with knife in Home Carentine
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News