- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ ప్రజాభిప్రాయ విశ్లేషకుడు, సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుగోపాల్ కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించే సర్వేలకు ఎంతో విశ్వసనీయత ఉందని, ఆయన చెప్పిన అనేక సర్వేల ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయని గుర్తుచేశారు. అలాగే, మియాపూర్ కార్పోరేటర్ మేక రమేష్ మృతిపట్ల సిఎం సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
CM KCR condolences on death of Miyapur Corporator
- Advertisement -