Wednesday, May 1, 2024

భారీగా విరాళాలు అందించిన దాతలు.. ధన్యవాదాలు తెలిపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు. ఎషియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ రూ.50 లక్షల విరాళం అందించారు. ఎఐజి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ డివిఎస్ రాజు ఇందుకు సంబంధించిన చెక్కును ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అందించారు. అలాగే అరబిందో ఫార్మా మొత్తం రూ. 11 కోట్ల విలువైన నగదు, శానిటైజర్లు, మందులు విరాళంగా అందించారు. ఇందులో రూ.7.5 కోట్ల నగదుకు సంబంధించిన చెక్కును అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి, డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సిఎంకు అందించారు. రూ.2.5 కోట్ల విలువైన శానిటైజర్లను, రూ.ఒక కోటి విలువైన మందులను రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వనున్నట్లు ప్రకటించారు.

గ్లాండ్ ఫార్మా ఒక కోటి రూపాయలను విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును గ్లాండ్ ఫార్మా ఎండి శ్రీనివాస్ సాదు సిఎంకు అందించారు. నవభారత్ వెంచర్స్ రూ.2.5 కోట్ల విరాళాన్ని సంస్థ చైర్మన్ డి.అశోక్, సిఇవో వి.విక్రం ప్రసాద్, ఇ.డి. నిఖిల్ సిఎంను కలిసి అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజనం వండే కార్మికులు మొత్తం రూ.2.65 కోట్ల విరాళం అందించనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమాండ్లు సిఎంకు అందించారు. విరాళాలు అందించిన దాతలందరికి ముఖ్యమంత్రి కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Aurobindo Pharma donates Rs 11 cr fight for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News