Tuesday, April 30, 2024

పురుగుల మందు కలిపిన బోండాలు తిని.. దంపతుల మృతి

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లాలో ఓ దంపతులు పొరపాటున నూనెకు బదులుగా పురుగుల మందు మైదా పిండిలో కలిపి బోండాలు తయారు చేశారు. ఆ బోండాలు తినడంతో దంపతులు మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్‌ఆర్ కండ్రిగ అనే గ్రామంలో పెరియా స్వామి అనే రైతు బజారుకు వెళ్లినప్పుడు మైదా పండితో పాటు మిరప తోటకు అవసరమైన పురుగుల మందు తీసుకున్నాడు. మైదాపిండి, పరుగులు మందు తీసుకొచ్చి కోడలు భారతి చేతికి ఇచ్చాడు. మైదాపిండిలో పరుగులు మందు కలిపి బోండాలు చేసింది. బోండాలు తిన్న తరువాత ఇంట్లో నలుగురికి వాంతులు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారతి, ఆమె భర్త శివకుమార్ ప్రాణాలు విడిచారు. పెళ్లైనా సంవత్సరానికే దంపతులు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. పెరియాస్వామి(65), భార్య లక్ష్మి (57) ఐసియులో చికిత్స పొందుతున్నారు. వృద్ధ దంపతులు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Couple dead with pesticide bottle of Bondalu in TN
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News