Sunday, May 5, 2024

ఆస్పత్రిలో ఉరేసుకున్న కోవిడ్ రోగి

- Advertisement -
- Advertisement -

Covid Patient commit suicide in Punjab

ఛండీగఢ్: ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో పాటు అతడికి కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ఉరేసుకొని చనిపోయిన సంఘటన పంజాబ్‌లోని లూథియానాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సత్పాల్ అనే వ్యక్తి తీవ్ర జ్వరం రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అక్కడ అతడికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో స్థానికంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. మంగళవారం సాయంత్రం అతడికి కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో వార్డులో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఎసిపి వార్యమ్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News