Sunday, April 28, 2024

మనీష్‌పై అభిమానులు ఫైర్

- Advertisement -
- Advertisement -

Cricket Fans Are Trolling Manish Pandey

అబుదాబి : ఈ ఐపిఎల్ సీజన్‌లో పేలవమైన ఆటతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండేపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక సమయంలో జట్టును ఆదుకోవడంలో మనీష్ విఫలమవుతున్నాడు. తాజాగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అతని వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. వరుస అవకాశాలు లభిస్తున్నా మనీష్ మాత్రం తన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోక పోవడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు. పేలవమైన బ్యాటింగ్‌తో జట్టు గెలుపు అవకాశాలను చేజార్చుతున్నాడని పలువురు మాజీ క్రికెటర్లు సయితం ఆరోపిస్తున్నారు. ఇక విజయ్ శంకర్, బైర్‌స్టో తదితరులపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక జట్టును ముందుండి నడిపించడంలో వార్నర్ కూడా విఫలమయ్యాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Cricket Fans Are Trolling Manish Pandey

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News