- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్ లో ఇప్పటికే కరోనా కేసులు 75లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 55,722 కొత్త కోవిడ్-19 కేసులు, 579 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల 75,50,273కి చేరాయి. ఇండియాలో ప్రస్తుతం 7,72,055 యాక్టివ్ కేసులుండగా… 66,63,608 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 1,14,610 మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 9.50కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… నిన్న ఒక్కరోజులోనే 9.50 లక్షల మందికి టెస్టులు చేసినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది.
55722 new covid 19 cases and 579 deaths in india
- Advertisement -