Friday, May 3, 2024

మదనపల్లె, ఒంగోలు, విజయవాడలలో నూతన స్టోర్‌ లను ప్రారంభించిన క్రోమా..

- Advertisement -
- Advertisement -

భారతదేశపు మొట్టమొదటి, టాటా గ్రూప్‌కు చెందిన, ఎక్కువ మంది అభిమానించే ఓమ్నీ ఛానెల్‌ ఎలకా్ట్రనిక్స్‌ రిటైలర్‌ క్రోమా, ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ మదనపల్లె, ఒంగోలులలో తమ మొదటి స్టోర్‌లతో పాటుగా విజయవాడలో తమ 11వ స్టోర్‌ను ప్రారంభించింది. నగరంలో మొట్టమొదటి జాతీయ స్ధాయి లార్జ్‌ ఫార్మాట్‌ స్పెషలిస్ట్‌ ఓమ్నీ ఛానెల్‌ ఎలకా్ట్రనిక్స్‌ రిటైలర్‌గా నిలిచిన క్రోమా, 550 కు పైగా బ్రాండ్ల వ్యాప్తంగా 16వేలకు పైగా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా ఆర్ధిక వ్యవస్థ, వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి ఉంటుంది. ఈ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అత్యంత కీలకంగా ఫార్మాస్యూటికల్స్‌, ఆటోమొబైల్స్‌, టెక్స్‌టైల్స్‌ మొదలైనవి ఉన్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ కేంద్రంగా కూడా నిలుస్తుంది. ఈ రాష్ట్రంలో చక్కగా అభివృద్ధి చేసిన సామాజిక, పారిశ్రామిక మౌలిక వసతులు ఉండటంతో పాటుగా చక్కటి వర్ట్యువల్‌ కనెక్టివిటీ కూడా ఉంది. ఈ రాష్ట్రంలో చక్కటి విద్యుత్‌, ఎయిర్‌పోర్ట్‌, ఐటీ, పోర్ట్‌ మౌలికవసతులు ఉండటం చేత అత్యుత్తమ, అత్యాధునిక ఎలకా్ట్రనిక్స్‌ కోరుకునే వారికి అభివృద్ధి చెందుతున్న వ్యాపార కేంద్రంగా నిలుస్తుంది.

క్రోమా విజయవాడ–ఎనికెపాడు స్టోర్‌ 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక లెవల్‌లో ఉండగా, మరియు క్రోమా మదనపల్లె 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్థులలో ఉండగా, క్రోమా ఒంగోలు స్టోర్‌ 10,242 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్ధులలో ఉంది. ఇక్కడ వినియోగదారులు అత్యున్నత అనుభవం, నైపుణ్యం కలిగిన క్రోమా ఎక్స్‌పర్ట్స్‌ నుంచి కొనుగోలు సమయంలో అవసరమైన సహాయాన్ని పొందగలరు. ఈ స్టోర్‌లలో వినియోగదారులు తాజా శ్రేణి ఉత్పత్తులను అన్వేషించవచ్చు. వీటిలో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్‌ ఉపకరణాలు, కూలింగ్‌ సొల్యూషన్స్‌, గృహోపకరణాలతో పాటుగా ఆడియో మరియు సంబంధిత యాక్ససరీలు ఉంటాయి. క్రోమా యొక్క కొనుగోలు అనంతర సేవలను సైతం వీరు పొందడంతో పాటుగా నైపుణ్యంతో కూడిన సలహాలను సైతం పొందవచ్చు . అలాగే తమ కొనుగోళ్లకు సంబంధించి అత్యన్నత అనుభవాలను పొందేందుకు షెడ్యూల్డ్‌ అభ్యాస కార్యక్రమాలలో సైతం వీరు పాల్గొనవచ్చు.

క్రోమా ఇన్ఫినిటీ–రిటైల్‌ లిమిటెడ్‌, ఎండీ–సీఈఓ అవిజిత్‌ మిత్రా మాట్లాడుతూ‘‘ మా నూతన స్టోర్లను ఆంధ్రప్రదేశ్‌లో ఎనికెపాడు, మదనపల్లె, ఒంగోలులో ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా రిటైల్‌ కార్యక్రమాలను విస్తరించడం ద్వారా మా వినియోగదారులకు మరింత సన్నిహితంగా చేరడంతో పాటుగా మా అత్యున్నత శ్రేణి, వినూత్నమైన ఉత్పత్తులు, ఆఫర్లును అందిస్తున్నాము. ఇది అనుసంధానిత మరియు నమ్మక ఆధారిత అనుభవాలను అందించనున్నాము. మా వినియోగదారులకు అత్యున్నత శ్రేణి, సమగ్రమైన షాపింగ్‌ అనుభవాలను అందించాలన్నది మా ప్రయత్నం. దేశవ్యాప్తంగా మేము మా కార్యకలాపాలను విస్తరించడంతో పాటుగా క్రోమా డాట్‌ కామ్‌తో ద్వారా వృద్ధి చెందుతున్న వినియోగదారుల డిమాండ్‌ను అందుబాటు ధరలో తీర్చనున్నాము’’ అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెండవ అతిపెద్ద నగరం విజయవాడ. రాష్ట్ర వాణిజ్య, రాజకీయ, సాంస్కృతిక, విద్యారాజధానిగా ఇది వెలుగొందుతుండటంతో పాటుగా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పది నగరాలలో ఒకటిగా నిలిచింది. క్రోమా ఎనికెపాడు 24కె కన్వెన్షన్‌ హాల్‌ ఎదురుగా, ఎనికెపాడు, విజయవాడ వద్ద ఉంది. మదనపల్లె యొక్క ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి ఉంది. ఆసియాలో అతిపెద్ద టమోటా మార్కెట్‌ ఇక్కడ ఉంది. అభివృద్ధి చెందుతున్న విద్యా కేంద్రంగా కూడా ఇది వెలుగొందుతుంది. ఈ స్టోర్‌ కద్రి హైవే రోడ్‌, కర్నాటక బ్యాంక్‌ ఎదురుగా, ఏ.వి నాయుడు కాలనీ, మదనపల్లె వద్ద ఉంది. ఒంగోలు యొక్క ప్రాధమిక పరిశ్రమ వ్యవసాయం. ఇక్కడ అత్యద్భుతమైన బీచ్‌లు, పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ స్టోర్‌ జీడీటీజీసీసీఎం సోసైటీ కాంప్లెక్స్‌, మొదటి లైన్‌, భాగ్యనగర్‌, ట్రంక్‌ రోడ్‌, ఒంగోలు వద్ద ఉంది. క్రోమా ఎనికెపాడు, మదనపల్లె, ఒంగోలు స్టోర్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఏడు రోజులూ తెరిచి ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News