Tuesday, April 30, 2024

ఉద్రిక్తత.. పొట్టు పొట్టు కొట్టుకున్న వైసిపి, టిడిపి కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపిలు వరస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా టిడిపి, వైసిపి పార్టీల కార్యకర్తలు పొట్టు పొట్టు కొట్టుకున్న సంఘటన ఒంగోలులో చోటుచేసుకుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసిపి, టిడిపి కార్యకర్తలు బుధవారం రాత్రి ఘోరంగా కొట్టుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు వైసిపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్. దీంతో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టి, గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News