- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యక్తిగత కారణాలతో సిఆర్పిఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని గాయత్రి హిల్స్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని గాయత్రిహిల్స్కు చెందిన భవానీశంకర్(30) సిఆర్పిఎఫ్ ఎస్ఐగా రాజస్థాన్లో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే శంకర్కు వివాహం అయింది. వ్యక్తిగత కారణాలతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఇన్స్స్పెక్టర్ సత్తయ్య సంఘటనా స్థలానికి చెరుకుని పరిశీలించారు.అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్స్పెక్టర్ సత్తయ్య తెలిపారు.
CRPF SI Hanging Self in Hyderabad
- Advertisement -