Friday, May 3, 2024

జిహెచ్‌ఎంసి కార్పొరేటర్‌కు సైబర్ వేధింపులు

- Advertisement -
- Advertisement -
Cyber ​​Harassment to GHMC Corporator Dedeepya
సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

హైదరాబాద్: సోషల్ మీడియాలో వేధింపులు ప్రజాప్రతినిధులకు తప్పడంలేదు. గతంలో యువతులు, విద్యార్థులకు ఇలాంటి వేధింపులకు ఎక్కువగా గురయ్యేవారు. నగరంలోని వెంగరళరావు కార్పొరేటర్ దేదీప్యపై అభ్యంతరకర వీడియోలు సృష్టించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు వెంటనే సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన క్యారెక్టర్ దిగజార్చేలా వీడియోలు మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. తనపై వీడియోలు సృషించింది మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ కుమారుడు వెంకట్‌అని అనుమానం వ్యక్తం చేసింది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నగర సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

Cyber ​​Harassment to GHMC Corporator Dedeepya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News