Friday, May 3, 2024

మణప్పురం గోల్డ్ లో రూ.30 లక్షల సైబర్ మోసం

- Advertisement -
- Advertisement -

Cyber crime in Manappuram gold

హైదరాబాద్: మణప్పురం గోల్డ్ సంస్థకు సైబర్ కేటుగాళ్లు ముప్పై లక్షలు రూపాయల టోకరా వేశారు. మణప్పురం ప్రధాన బ్రాంచి ఉన్నతాధికారినంటూ హిమాయత్ నగర్ బ్రాంచ్ ఉద్యోగులకు ఫోన్ చేశారు. వారి లాగిన్ ఐడి, పాస్ వార్డు తీస్కుని ముప్పై లక్షలు రూపాయలు కేటుగాళ్లు కాజేశారు. ఇద్దరు ఉద్యోగులను బురిడీ కొట్టించి వారి ఐడీలనుండి లాగిన్ అయి పదిహేను లక్షల చొప్పున కాజేసినట్లు సంస్థ ఉన్నతాధికారులు గుర్తించారు. హిమాయత్ నగర్ మణప్పురం బ్రాంచ్ మేనేజర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News