Wednesday, May 1, 2024

కేంద్ర సిబ్బంది డిఎ 11% పెంపు

- Advertisement -
- Advertisement -

DA hike for central government employees

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ పెంచుతూకేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల డిఎ 17శాతం నుంచి 28 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. 7వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేబినెట్ డిఎ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 1 నుంచి పెంచిన డిఎ అమలు కానుందని కేంద్ర స్పష్టం చేసింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పినట్టు అయింది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రెస్ ఇండెక్స్ డేటా ఆధారంగా డిఎ పెంపు ఉంటుందని కేంద్రం పేర్కొంది.

DA hike for central government employees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News