Wednesday, May 1, 2024

గ్రూప్-4 ఎగ్జామ్ సెంటర్‌ను పరిశీలించిన డిసిపి రాజేష్ చంద్ర

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: బొమ్మలరామారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో శనివారం గ్రూప్ 4 ఎగ్జామ్ సెంటర్‌ను డిసిపి రాజేష్ చంద్ర,శివ సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జామ్స్ సెంటర్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకే రోజు రెండు విడతలుగా జరిగే గ్రూప్ 4 ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్టు ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నత అధికారులకు తెలియజేశారు. ఉన్నత అధికారులతో పాటు తాహసీల్దార్ పద్మ సుందరి ఎంపీడీవో సరిత బొమ్మలరామారం ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి పోలీస్ రెవెన్యూ సిబ్బంది ఎగ్జామ్స్ సెంటర్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News