Monday, May 13, 2024

రేపు డిగ్రీ మొదటి సీట్ల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

degree seats allocation tomorrow

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ మొదటి విడత సీట్లు బుధవారం కేటాయించనున్నారు. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్‌కు ఈసారి మొదటి విడతలోనే దరఖాస్తులు రెండు లక్షలు దాటాయి. దోస్త్ మొదటి విడత 2.05 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏటా మొదటి విడతలో సుమారు 1.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటుండగా, ఈసారి సుమారు 50 వేల మంది అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 4వ తేదీన దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. మొదటి విడత సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 5 నుంచి 9 వరకు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. దోస్త్ రెండవ విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25న రెండవ విడత సీట్లు కేటాయించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News