telangana eamcet admit card download 2021
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో (లాటరల్ ఎంట్రీ) ప్రవేశాల కోసం మంగళవారం నిర్వహించిన ఇసెట్ పరీక్షకు 95.46 శాతం హాజరు నమోదైంది. మొత్తం 41 పరీక్షా కేంద్రాలలో ఇసెట్ పరీక్ష జరుగగా తెలంగాణలో 37 కేంద్రాలలో, ఆంధ్రప్రదేశ్లలో 4 కేంద్రాలు పరీక్ష నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత తొలి ప్రవేశ పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో విజయవంతంగా ముగిసింది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించినట్లు ఇసెట్ కన్వీనర్ సిహెచ్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల ప్రారంభమైన మొదటి సెషన్కు సెట్ ఎ ప్రశ్నాపత్రాన్ని లాటరీ విధానంలో ఎంపిక చేయగా, మధ్యాహ్నం 3 గంటల ప్రారంభమైన రెండవ సెషన్కు సెట్ బి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశామని అన్నారు.