న్యూఢిల్లీ: ఓ యువకుడు పూటుగా మద్యం సేవించి కారును వేగంగా నడుపుతూ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఢిల్లీ యూనివర్సిటీ ఖల్సా కళాశాల సమీపంలో సోమవారం తెల్లవారుజూమున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందగా… డ్రైవర్కు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. యవకుడిని మోడల్ సిటీ ప్రాంతానికి చెందిన తుషార్ గా పోలీసులు గుర్తించారు. కారు ఢీకొన్న వేగానికి పెట్రోలింగ్ వాహనం 10 అడుగుల మేర గాలిలో ఎగిరిపడినట్టు ఢిల్లీ ఉత్తర మండల డిసిపి మోనికా భరద్వాజ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తుషార్పై ఐపిసి 279, 337,304 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
One police personnel lost his life and another sustained injuries after a speeding car rammed into their patrol vehicle near Khalsa College late last night. The driver of the vehicle was in an inebriated state. Case registered: Monika Bhardwaj, DCP (North) #Delhi pic.twitter.com/He4DlyFOE3
— ANI (@ANI) August 10, 2020