Thursday, May 2, 2024

ఢిల్లీ స్కూల్ స్టూడెంట్, టీచర్ కు కొవిడ్ పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Dehi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఒక పాఠశాలలో కొవిడ్ పరీక్ష నిర్వహించగా ఓ విద్యార్థి,  ఉపాధ్యాయుడికి కొవిడ్ పాజిటివ్ అని తేలింది.  ఆ తరువాత బాధిత విద్యార్థి యొక్క సహవిద్యార్థులందరినీ ఇంటికి పంపించేశారు. దేశ రాజధానిలోని ప్రైవేట్‌గా నడిచే పాఠశాలలో తాజా అంటువ్యాధి వెలుగుచూసింది. కాగా దాని  ప్రక్కనే ఉన్న నోయిడా మరియు ఘజియాబాద్‌లోని పాఠశాలల్లో కొత్త కేసులు వెలుగుచూశాయి.

ఢిల్లీలో 299 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి.  అంతకు ముందు రోజు కేసుల సంఖ్య 202 ఉండింది. అంటే దాదాపు 50 శాతం పెరిగింది. దేశ రాజధానిలో మొత్తం కేస్లోడ్ ఇప్పుడు 18,66,881కి పెరిగింది. ఎమ్మెల్యే మరియు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు అతిషి మాట్లాడుతూ, “ఒక చిన్నారి,  ఉపాధ్యాయుడికి కోవిడ్‌కు పాజిటివ్ వచ్చింది. తరగతిలోని ఇతర విద్యార్థులను ఇంటికి పంపారు. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము” అన్నారు.

మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఆఫ్‌లైన్ తరగతులకు పాఠశాలలు తెరిచిన కొన్ని వారాలకే  క్యాంపస్‌ల నుండి ఇన్‌ఫెక్షన్ల నివేదికలు వెలువడ్డం ఆందోళనకు దారితీశాయి. కొవిడ్ కారణంగా పాఠశాలలు చాలా కాలంగా మూసివేయబడటంతో విద్యార్థుల చదువు  ప్రభావితం అయింది. దేశంలోని డిజిటల్ విభజన కారణంగా ఒక వర్గం విద్యార్థులు పూర్తిగా నష్టపోతున్నారు. వర్చువల్ తరగతులకు లాగిన్ చేయగలిగిన వారు కూడా వారి స్నేహితుల నుండి దూరంగా ఉండటంతో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో, కొత్త ఇన్ఫెక్షన్లు ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News