హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మరోమారు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఎంఎల్సి మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం వివేకానందనగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి మాధవరం రోజాదేవిని గెలిపించాలంటూ వెంకటేశ్వర్నగర్, ఆర్.పి.కాలమీలోని పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… టిఆర్ఎస్ పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్లు నిరంతరం గ్రేటర్ నగరాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. డిసంబర్ 01న జరిగే గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు డివిజన్ అధ్యక్షుడు సంజీవ్రెడ్డి నాయకులు పెద్ద భాస్కర్రావు, నాయినేని చమద్రకాంత్రావు వార్డు సభ్యులు వెంకటస్వామి సాగర్, రేణుక నాయకులు సత్యనారాయణ, డాన్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Development with TRS Says MLC Mahender Reddy