Monday, April 29, 2024

రెండు లక్షల 65 వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

921 New Covid-19 Cases four Deaths in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 65 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 65 వేల నలభై తొమ్మిది మందికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఇతర రాష్ట్రాల కంటే మన దగ్గర వైరస్ తీవ్రత అతి తక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం 42,740 మందికి టెస్టులు చేయగా 921 మందికి వైరస్ సోకింది.

వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 146 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 6, భద్రాద్రి 71, జగిత్యాల 50, జనగాం 8, భూపాలపల్లి 19, గద్వాల 5, కామారెడ్డి 11, కరీంనగర్ 44,ఖమ్మం 36, ఆసిఫాబాద్ 9, మహబూబ్‌నగర్ 14, మహబూబాబాద్ 15, మంచిర్యాల 18, మెదక్ 9, మేడ్చల్ మల్కాజ్‌గిరి 81, ములుగు 16, నాగర్‌కర్నూల్ 9, నల్గొండ 49, నారాయణపేట్ 4, నిర్మల్ 8, నిజామాబాద్ 15, పెద్దపల్లి 29, సిరిసిల్లా 27, రంగారెడ్డి 61, సంగారెడ్డి 17, సిద్ధిపేట్ 18, సూర్యాపేట్ 31, వికారాబాద్ 7, వనపర్తి 11, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ లో 45, యాదాద్రిలో మరో 18 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో నలుగురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,65,049కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,52,565కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

52 లక్షలకు పెరిగిన కరోనా పరీక్షలు….

రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 52 లక్షలకు పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 52,01,214 మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. అంటే ప్రతి పది లక్షల మందిలో లక్షా 39 వేల 742 మంది టెస్టులు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ నివేదించింది. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత రెట్టింపు చేయనున్నట్లు డిహెచ్ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News